సింగరేణి సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఏడాది వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గి 58 మిలియన్ టన్నులకే పరిమితమైనా, నిల్వ ఉన్న బొగ్గు రవాణాతో లక్ష్యాన్ని చేరుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈసారి ఏప్రిల్ నుంచే ముందస్తు ప్రణాళికలతో ఉత్పత్తిపై దృష్టి సారించనున్నట్లు డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ తెలిపారు. ఓబీ వెలికితీతలో వెనుకబడినప్పటికీ, ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
![]()




