ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాల విస్తరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో భారత్కు చెందిన 12,000 మంది ఉండటం గమనార్హం. ఏఐ డేటా కేంద్రాల కోసం రూ.4.60 లక్షల కోట్ల నిధుల సమీకరణలో భాగంగా వ్యయ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ముందస్తు సమాచారం లేకుండా మెయిల్ ద్వారా లేఆఫ్లు ప్రకటించడంతో ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది.
![]()




