📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, August 25, 2026
Visitors: 1,676,132  |  759 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దంచికొట్టిన భారీ వర్షం: ట్రాఫిక్ స్తంభన, 15 విమానాలు దారి మళ్లింపుభారత సైన్యంలోకి ‘ఏకే-203 షేర్’: ఇన్సాస్ రైఫిళ్లకు స్వస్తి..డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ చెల్లవు: ఆర్బీఐఅస్సాంలో ఐవీఎఫ్ (IVF) అద్భుతం: దేశంలోనే తొలిసారిగా ‘లక్ష్మీ’ పశు జాతి ఆడ దూడ జననంజాతీయ రవాణా రంగంలో 1.3 కి.మీ పొడవైన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు సరికొత్త సంచలనం
Khammam ⚡ AMP

ఏజెన్సీ ఎస్సీల హక్కుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతాం: ఎమ్మెల్యే కూనంనేని

April 2, 2026 April 2, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కొత్తగూడెం అంబేద్కర్‌ కమ్యూనిటీ హాలులో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘ధర్మ పోరాట సభ’ విజయవంతమైంది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏజెన్సీ ప్రాంత ఎస్సీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2019 నూతన పంచాయతీ రాజ్ చట్టం వల్ల ఏజెన్సీ దళితులకు తీరని అన్యాయం జరిగిందని, రద్దయిన స్థానిక రిజర్వేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. .

రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ.. మైదాన ప్రాంత ఎస్సీలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంత దళితులపై ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంట రుణాలు, స్థానిక ఉద్యోగ అవకాశాలు నేడు కరువయ్యాయని, హక్కుల సాధన కోసం దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జేఏసీ రాష్ట్ర నాయకులు గోడ రమేష్, ఎస్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!