డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ప్రవేశపెట్టిన ‘టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్’ నిబంధన నేటి (ఏప్రిల్ 1) నుండి అమలులోకి వచ్చింది. ఇకపై యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు పిన్తో పాటు ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. అదనపు భద్రత కోసం బ్యాంకింగ్ యాప్స్లో స్క్రీన్ షాట్లు, రికార్డింగ్లపై కూడా నిషేధం విధించారు. ఈ విధానం వల్ల అనధికారిక లావాదేవీలకు అడ్డుకట్ట పడనుంది.
![]()




