దక్షిణ మధ్య రైల్వే (SCR) టికెట్ తనిఖీల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ణయించిన రూ. 221.08 కోట్ల లక్ష్యాన్ని, గడువుకు 14 రోజుల ముందే అధిగమించి రూ. 223.60 కోట్ల జరిమానా వసూలు చేసింది. టికెట్ లేని ప్రయాణాలు, అక్రమ లగేజీ వంటి ఉల్లంఘనల ద్వారా ఈ భారీ ఆదాయం సమకూరింది. ముఖ్యంగా అక్టోబర్ 18, 2025న ఒక్కరోజే రూ. 1.85 కోట్లు వసూలు చేయడం విశేషం. రైల్వే సిబ్బంది అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కొనియాడారు.
![]()




