📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,764,753  |  296 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Telangana ⚡ AMP

వినాయక చవితి మండపాలపై TG హైకోర్టు కీలక మార్గదర్శకాలు

August 27, 2025 August 27, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

– శబ్దం, ట్రాఫిక్‌ అవాంతరాల నివారణకు స్పష్టమైన ఆదేశాలు

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయడం వల్ల వృద్ధులు, గర్భిణులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మితిమీరిన శబ్దాలు, ట్రాఫిక్‌కు ఏర్పడుతున్న అడ్డంకులు ప్రజారోగ్యం, భద్రతపై ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించింది.

సికింద్రాబాద్‌ ఎంఈఎస్‌ కాలనీకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ప్రభావతి, ఓ గర్భిణి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీరి ఆరోపణల ప్రకారం, ఇంటి గేటుకు అడ్డంగా మండపం పెట్టడంతో బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ స్పందిస్తూ, ఉత్సవాల నిమిత్తం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ముప్పుగా మారే విధంగా లౌడ్‌స్పీకర్లు వాడకూడదని, రాత్రి 10 గంటల తరువాత శబ్దం వినిపించరాదని స్పష్టం చేశారు.

మండపాల ఏర్పాట్లను ప్రభుత్వ అనుమతులు పొందిన ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని, రోడ్లపై, ఇళ్ల గేట్ల వద్ద, ఆసుపత్రుల సమీపాల్లో వాటిని ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే మండపాలను కూల్చివేయడంలో జాప్యం చేయకూడదని అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌ కనెక్షన్లు పూర్తిగా సురక్షితంగా ఉండాలని, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్ వాహనాలు వెళ్లే మార్గాల్లో మండపాలు లేకుండా చూసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్సవాల్లో మితిమేరకే సౌండ్‌ సిస్టంలను వాడాలని స్పష్టం చేసింది.

ప్రతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుల స్వీకరణ కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని, ఎవరి దగ్గర నుంచి అయినా శబ్ద మితి దాటి nuisance ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే, నిమజ్జన కార్యక్రమాల అనంతరం ఏర్పడే వ్యర్థాలను తొలగించే బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేసింది.

ముందుగా అనుమతి పొందిన మండపాలే నిలబడాలని, ప్రతి మండపం తరఫున ఒక బాధ్యతాయుత వ్యక్తిని నియమించి, శబ్ద నియంత్రణ, పర్యావరణ నిబంధనలు పాటించనున్నట్లు హామీ పత్రం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. వినాయక చవితి పండుగ ఉత్సాహభరితంగా జరగడం మంచిదే కానీ, అది ఇతరుల హక్కులను హరించేలా ఉండకూడదని స్పష్టం చేసింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!