📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,765,515  |  373 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Telangana ⚡ AMP

“ఉచిత బస్సు ప్రయాణం – మహిళలకు వరమా?” అసౌకర్యాల వేదికగా మారిందా?

July 21, 2025 July 21, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంను శుభ సంకేతంగా చూడటం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసిన మొదటి ఫైలే ఈ పథకం కావడం, తొలి దశలో దీనికి పొందిన ప్రశంసలు, ఉత్సాహం – ఇవన్నీ మహత్తర నిర్ణయంగా అభివర్ణించబడ్డాయి. మహిళలు ఉద్యోగాలకు, విద్యకు, ఇతర అవసరాలకు అంతరాయం లేకుండా ప్రయాణించేందుకు ఇది ఎంతో ఉపకరించిందనే అభిప్రాయం మొదట్లో కనిపించింది. కానీ రోజులు గడిచేకొద్దీ సమస్యలు జెరాబిల్లు లాగానే బయటపడుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరగగా, బస్సులు, సిబ్బంది మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. ఫలితంగా మహిళలు గౌరవం లేకుండా ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రస్తుతం రోజుకి సగటున 33 లక్షలకుపైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కానీ ఈ విపరీతమైన రద్దీకి తగినట్లుగా బస్సులు అందుబాటులో లేకపోవడం, నిత్యం తగాదాలు, తోపులాటలు, బస్సుల్లో పైకి చేరే పరిస్థితులు, డ్రైవర్లు–కండక్టర్లతో వాగ్వాదాలు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు చాలా జిల్లాల్లో తక్కువగా ఉండటం వల్ల, మహిళలు గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉంది. నగరాల్లో సైతం బస్సుల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రయాణాలు అసౌకర్యంగా మారాయి. బస్సుల్లో టెక్నికల్ సమస్యలు, మరమ్మతులు జరగకపోవడం, సీట్ల కొరత, ఓవర్‌లోడింగ్ వల్లే కొన్నిసార్లు రోడ్డుపైనే బస్సులు ఆగిపోవడం జరుగుతోంది.

ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ చేసిన తాజా సర్వే ప్రకారం, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళల్లో 52 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో రద్దీ, భద్రతా లోపాలు, లైటింగ్ సదుపాయాల లేమి, మహిళల కోసం ప్రత్యేకంగా శౌచాలయాలు లేకపోవడం, బస్టాండ్లలో తగిన సౌకర్యాలు లేకపోవడం వంటి అంశాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్ల, మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలు అధికారుల దృష్టికి రావడం లేదు. మహిళలకు గౌరవంతో కూడిన ప్రయాణం హక్కు అని పేర్కొన్న ఈ సర్వే ప్రభుత్వం గమనించి చర్యలు తీసుకోవాలంటూ సూచించింది.

ప్రభుత్వం నెలకు రూ. 325 కోట్లు RTCకి చెల్లిస్తోందని చెబుతోంది. కానీ అదే సమయంలో కొత్త బస్సులు తీసుకురావడం, సిబ్బందిని నియమించడం ఆగిపోవడంతో ఆర్టీసీ పరిస్థితి దారుణంగా మారింది. ఉద్యోగులే సంస్థను గాలి బుడగలా నెట్టుకుంటూ వెళ్లిపోతున్నామంటూ బాధ పడుతున్నారు. ఫ్రీ ప్రయాణం పేరిట వచ్చిన తలరాత మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి సైతం భారంగా మారింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినంత వేగంగా, అదే ఉత్సాహంతో నిర్వహణా వ్యవస్థను బలోపేతం చేయకపోతే, మహిళలకు స్వేచ్ఛతో కూడిన ప్రయాణం కలగడం కష్టం. మహాలక్ష్మి పథకం నిజంగా “మహిలల కోసం” అన్న ఆశయం నెరవేర్చాలంటే, సౌకర్యాల పెంపు, సిబ్బంది శిక్షణ, భద్రతా చర్యలు కీలకంగా మారాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!