Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Andhra

ఎన్ పి ఎస్ క్విట్ ఇండియా AINPSEF తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

పాత పింఛను పథకం సాధన కోసం ఈ నెల లో ఢిల్లీ లో కార్యక్రమం ఉందని ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్ తెలిపారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. బెంగుళూరు లో జరిగిన కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు.”నో ఎన్ పి ఎస్”,”నో..యూ పి ఎస్”ఓన్లీ ఓ పి ఎస్”, అనే నినాదం తో ఈ నెలలో కొత్త ఢిల్లీ లో కార్యక్రమం ఉందన్నారు. […]

Loading

పాత పింఛను పథకం సాధన కోసం ఈ నెల లో ఢిల్లీ లో కార్యక్రమం ఉందని ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్ తెలిపారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. బెంగుళూరు లో జరిగిన కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు.”నో ఎన్ పి ఎస్”,”నో..యూ పి ఎస్”ఓన్లీ ఓ పి ఎస్”, అనే నినాదం తో ఈ నెలలో కొత్త ఢిల్లీ లో కార్యక్రమం ఉందన్నారు. పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం తాము చేస్తున్న విన్నపాలు పాలకుల చెవికి ఎక్కడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.అందుకే కొత్త ఢిల్లీ లో రామ్ లీల మైదానం లో పెద్ద ఎత్తున “ఎన్ పి ఎస్ క్విట్ ఇండియా” పేరిట బహిరంగ సభ ను నిర్వహించనున్నట్టు మాచన రఘునందన్ చెప్పారు. ఉద్యోగుల వేతనం లో నుంచి భాగస్వామ్య పింఛను పథకం కోసం సేకరిస్తున్న డబ్బు ఎక్కడ దాచారు, ఎంత పొగయ్యింది,అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఐతే?! డబ్బు తీసుకునే వెసులుబాటు ఉందా ,లేదా అనే విషయం కూడా తెలియని అగమ్య గోచర పరిస్థితి లో న్యూ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారని రఘునందన్ అభిప్రాయ పడ్డారు. అందుకే దేశ వ్యాప్తంగా సి పి ఎస్ శ్రేణులు అబాలీష్ సి పి ఎస్ అని ముక్త కంఠంతో ఘోషిస్తున్నారని మాచన రఘునందన్ అన్నారు. పాత పింఛను పథకం సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!