📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 487,790  |  580 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Andhra ⚡ AMP

కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

January 15, 2025 January 15, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (1956 సెక్షన్ 3) ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలని చెప్పారు. ఢిల్లీలో జరిగిన సమీక్షలో నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం పలు సూచనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (2014) సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయాలి.
గోదావరి-బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖలు రాయాలి. భద్రాచలం ముంపు సమస్యపై హైదరాబాదు IITతో అధ్యయనం వేగవంతం చేయాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అనుమతులను త్వరితగతిన సాధించాలి. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!