2050 అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ తాగునీటి ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

మహానగరంలో 2050 నాటికి పెరిగే జనాభా నీటి అవసరాలను తీర్చేందుకు మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశించారు. జలమండలి బోర్డు తొలి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది.

సమావేశంలోని కీలక నిర్ణయాలు:

  1. సివరేజీ ప్రణాళిక: భవిష్యత్తు అవసరాల కోసం ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయాలని ఆదేశాలు.
  2. గోదావరి ఫేజ్-2: 20 టీఎంసీల నీటిని మల్లన్నసాగర్ ద్వారా సరఫరా చేసేందుకు మార్పులకు ఆమోదం.
  3. మంజీరా పైపులైన్ల పునర్నిర్మాణం: కాలం చెల్లిన పైపులైన్ల స్థానంలో కొత్త ఆధునిక పైపులైన్ నిర్మాణానికి ఆదేశాలు.
  4. జలమండలి ఆదాయ వృద్ధి: నూతన ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీ రుణాలు తీసుకునే మార్గాలపై పరిశీలన.

ఈ సమావేశంలో సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!