📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,040,083  |  426 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Telangana ⚡ AMP

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు

January 2, 2025 January 2, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు 2024 సంవత్సరానికి అర్జున అవార్డుకు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి గారు తెలిపారు, ‘‘ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా, అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే మా లక్ష్యం. దీప్తి గారికి 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ గారికి 10 లక్షల నగదు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా, గౌరవంగా 500 గజాల స్థలం కేటాయించడంతో పాటు గ్రూప్-2 స్థాయి ఉద్యోగం కూడా అందజేశాం.’’

ముఖ్యమంత్రి గారు, ‘‘తమ ప్రదర్శనతో తెలంగాణ యువ క్రీడాకారులు మరింత మెరుగు చూపించాలని, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి కృషిని ప్రోత్సహించేందుకు సహకరించనున్నాయి’’ అని అన్నారు.

అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లకు కూడా అభినందనలు తెలియజేశారు. 2024లో అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు మరియు కోచ్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!