తమిళనాడులోని విలాతికుళం ప్రాంతంలో $12$వ తరగతి విద్యార్థినిపై జరిగిన హత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ధర్మ మునీశ్వరన్కు కోర్టు ‘డబుల్ డెత్ పెనాల్టీ’ (రెండు మరణ శిక్షలు) విధించింది. మార్చి $10$న అపహరణకు గురైన బాలిక మరుసటి రోజు అటవీ ప్రాంతంలో శవమై లభ్యమైంది. గతంలోనూ ఓ వృద్ధురాలిపై హత్యాచారానికి పాల్పడి బెయిల్పై వచ్చిన నిందితుడు, మళ్లీ ఈ ఘోరానికి ఒడిగట్టడాన్ని అరుదైన కేసుగా పరిగణించిన న్యాయస్థానం ఈ కఠిన శిక్ష ఖరారు చేసింది.
![]()




