జనసమ్మర్ద ప్రాంతాల నుండి వీధి కుక్కలను తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి బహిరంగ ప్రదేశాల నుండి తరలించిన శునకాలను మళ్లీ అక్కడ వదలవద్దని స్పష్టం చేసింది. రేబిస్ సోకిన, విపరీత ప్రవర్తన గల కుక్కలకు కారుణ్య మరణం కల్పించేందుకు అనుమతించింది. చిన్నారులపై జరుగుతున్న దాడులను విస్మరించలేమని పేర్కొంటూ, గత ఆదేశాలు పాటించని రాష్ట్రాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
![]()




