దేశ రాజధాని దిల్లీలోని అమర్ కాలనీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె (ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్) దారుణ హత్యకు గురైంది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు జిమ్కు వెళ్లిన సమయంలో నిందితుడు ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆరు వారాల క్రితం పనిలో నుంచి తొలగించబడిన పాత పనివాడే గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. యూపీఎస్సీకి సిద్ధమవుతున్న యువతి ఇలా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.
![]()




