నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఈ నెల 16న కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం లోక్సభ స్థానాలు 543 నుండి 850కి పెరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున 50% సీట్లు పెంచి, రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుండగా, దీనిపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు బుధవారం సమావేశం కానున్నారు.
![]()




