📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,491  |  772 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Crime ⚡ AMP

మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం: ఆరుగురు అరెస్ట్

March 18, 2025 March 18, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసి వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ముస్కు లత వ్యభిచార వృత్తిలో నూతన బాలికలను మోసపుచ్చి తీసుకురావడం ద్వారా డబ్బు సంపాదించేందుకు కుట్ర చేసినట్లు గుర్తించారు.

నిందితుల వివరాలు:

  1. ముస్కు లత (ల్యాదేళ్ళ, దామెర మండలం)
  2. మైనర్ బాలిక
  3. అబ్దుల్ అఫ్నాన్ (వరంగల్ శంభుని పేట)
  4. షేక్ సైలాని బాబా
  5. మహ్మద్ అల్తాఫ్
  6. మీర్జా ఫైజ్ బేగ్ అలియాస్ వదూద్

పోలీసు దర్యాప్తు:
ఈ నెల 11న బాలిక కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి ములుగు క్రాస్ రోడ్డులో బాలికను గుర్తించారు. విచారణలో, నిందితులు బాలికను మోసపుచ్చి మద్యం, గంజాయి త్రాగించి అత్యాచారం జరిపినట్లు వెల్లడైంది. అనంతరం ఆమెను బెదిరించి వ్యభిచారంలోకి దిగేలా ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది.

స్వాధీనం చేసుకున్నవి:

  • 1.8 కిలోల గంజాయి
  • ఒక కారు
  • ₹75,000 నగదు
  • నాలుగు సెల్‌ఫోన్లు
  • కండోమ్ ప్యాకెట్లు

పోలీసుల ప్రతిభ:
కేసు పరిష్కారంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, ఇన్స్పెక్టర్ వెంకటరత్నం సహా ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక పాత్ర పోషించిందని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!