📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,766,442  |  397 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Crime ⚡ AMP

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు

March 10, 2025 March 10, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.

కేసు నేపథ్యం:

అమృత వర్షిణి, ప్రణయ్‌లు ప్రేమవివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

విచారణ:

కేసు నమోదు చేసిన పోలీసులు, మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం, 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాలు, ఆధారాల సమర్పణ పూర్తి కావడంతో, న్యాయస్థానం మార్చి 10న తుది తీర్పు వెలువడనుంది.

ప్రస్తుత పరిస్థితి:

నల్లగొండ ఎస్సీ/ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తుది తీర్పు కోసం ప్రణయ్ కుటుంబ సభ్యులు, అమృత, మీడియా ప్రతినిధులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పరువు హత్యలపై చర్చకు దారితీస్తుందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు నివారించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!