Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
National

కేంద్ర బడ్జెట్‌ 2025: ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25లో భారత ఎకానమీ వృద్ధి 6.4%గా అంచనా, 2025-26లో 6.3-6.8% శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కోసం 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా పథకాలు ప్రవేశపెట్టారు. పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 6 ఏళ్ల ప్రణాళిక రూపొందించారు. PM ధన్‌ధాన్య యోజనను 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. రైతులకు ప్రోత్సాహం MSME, స్టార్టప్‌లకు మద్దతు విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రాధాన్యం భౌతిక సదుపాయాల […]

Loading

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25లో భారత ఎకానమీ వృద్ధి 6.4%గా అంచనా, 2025-26లో 6.3-6.8% శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కోసం 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా పథకాలు ప్రవేశపెట్టారు. పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 6 ఏళ్ల ప్రణాళిక రూపొందించారు. PM ధన్‌ధాన్య యోజనను 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

రైతులకు ప్రోత్సాహం

  • కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.
  • బీహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు, ఉత్పత్తి పెంపునకు శిక్షణ.
  • వ్యవసాయ ఎగుమతులకు MSMEలకు రూ.20 కోట్ల వరకు రుణాలు.

MSME, స్టార్టప్‌లకు మద్దతు

  • MSMEలకు ఇచ్చే రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు.
  • స్టార్టప్‌లకు రుణాలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు.
  • గ్రామీణ ఎకానమీలో పోస్టాఫీసుల పాత్రను పెంచేందుకు లక్షన్నర గ్రామీణ పోస్టాఫీసులకు మద్దతు.

విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రాధాన్యం

  • అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు.
  • ఐఐటీ పాట్నా విస్తరణ, ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు.
  • 75,000 మెడికల్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి.
  • అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు.
  • కోటి మంది గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా.

భౌతిక సదుపాయాల అభివృద్ధి

  • జల్‌ జీవన్‌ మిషన్‌ను 2028 వరకు పొడిగింపు.
  • పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్‌ నిర్మాణం.
  • బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి.
  • రూ.25 వేల కోట్ల మేరీటైమ్‌ అభివృద్ధి ఫండ్‌ ఏర్పాటు.

సంస్కరణలు, కొత్త పథకాలు

  • టాక్సేషన్‌, విద్యుత్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, మైనింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో కీలక మార్పులు.
  • రుణ రహితంగా 50 ఏళ్లకు ప్రోత్సాహకాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు.
  • అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ.
  • స్ట్రీట్‌ వెండర్లకు రూ.30,000 క్రెడిట్‌ కార్డులు.
  • బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహం.

కేంద్ర బడ్జెట్ 2025: కొత్త పథకాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం

కేంద్రీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పర్యాటక రంగ అభివృద్ధి, ఇన్సూరెన్స్‌ రంగంలో 100% FDI, ఆహార భద్రత కోసం జీన్‌ బ్యాంక్‌ ఏర్పాటు, సస్టైనబుల్‌ ఇన్వెస్టుమెంట్స్‌కు ప్రోత్సాహం వంటి పలు కీలక ప్రాజెక్టుల ప్రకటనలు చేశారు.

పర్యాటక రంగానికి ప్రోత్సాహం

  • రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.
  • మెరుగైన రవాణా సదుపాయాలు, మరో 120 రూట్లలో ఉడాన్‌ పథకం.

ఫెలోషిప్స్, పరిశోధనలకు ప్రోత్సాహం

  • IIT, IISCలో 10 వేల మందికి ఫెలోషిప్స్‌.
  • ఆహార భద్రత కోసం జీన్‌ బ్యాంక్‌ ఏర్పాటు.

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సులభతరం

  • కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
  • అనవసరమైన సెక్షన్లు తొలగింపు, స్వయం సహాయక గ్రూపులకు క్రెడిట్‌ కార్డులు.
  • మిడిల్‌ క్లాస్‌ ప్రజల కోసం వ్యక్తిగత పన్ను విధానం, TDSపై క్లారిటీ.

సాంకేతిక పరిశ్రమలకు ప్రోత్సాహం

  • క్లీన్‌టెక్‌ మిషన్ ద్వారా ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం.

ఈ బడ్జెట్‌ ద్వారా ఆయా రంగాల్లో పురోగతి కోసం కేంద్రం నూతన పథకాలను ప్రవేశపెట్టింది.

కేంద్ర బడ్జెట్‌ ద్వారా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి, భారత్‌ను ఆర్థికంగా మరింత బలంగా మార్చేలా చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!