📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,537,179  |  115 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam ⚡ AMP

భద్రాద్రి కొత్తగూడెంలో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

March 24, 2025 March 24, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు మంగళవారం మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ నేతృత్వంలో మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్‌కు నాలుగు ప్రధాన డిమాండ్లతో మెమొరాండం అందజేశారు:

  1. ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకించడం: తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేయడాన్ని మాలమహానాడు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వర్గీకరణ వల్ల పేద మాల సామాజిక వర్గానికి నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
  2. క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయడం: ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన క్రిమిలేయర్ విధానాన్ని కూడా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేస్తున్నప్పుడు క్రిమిలేయర్ విధానాన్ని పక్కన పెట్టడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
  3. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ: కొత్తగూడెం నియోజకవర్గంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను వచ్చే నెలలో జరగనున్న మహనీయుల జయంతుల నిమిత్తం మరమ్మతులు చేసి, పునరుద్ధరించాలని కోరారు.
  4. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల నిరాహార దీక్షకు పరిష్కారం: కొత్తగూడెంలో ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను పరిష్కరించాలని, లేకపోతే మాలమహానాడు సభ్యులు కూడా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా జనరల్ సెక్రటరీ అల్లాడి పాల్ రాజ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ దామళ్ల సత్యనారాయణ, సీనియర్ నాయకులు నవతన్ జిల్లా అధ్యక్షులు కొప్పుల రామారావు, తుమ్మల కిరణ్, రాయి రాజా, చల్లా పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!