- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో — డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరుగనున్నాయి.
- పోలింగ్కు వచ్చే ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారులు సూచించారు.
- ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో, ఎలక్షన్ కమిషన్ అనుమతించిన 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకురావచ్చు.
అంగీకరించిన 18 గుర్తింపు కార్డులు:
- ఆధార్ కార్డు
- నెరేగా జాబ్ కార్డు
- బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ ఫోటో పాస్బుక్
- హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- పాన్ కార్డు
- ఎస్సీ/ఎస్టీ/బీసీ కుల ధృవీకరణ పత్రం (ఫోటోతో)
- భారత పాస్పోర్ట్
- పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటోతో)
- ప్రభుత్వ ఉద్యోగుల ఐడీ కార్డు
- ఎమ్మెల్యే/ఎంఎంఎల్సీ ఐడీ కార్డులు
- దివ్యాంగుల గుర్తింపు కార్డు
- పట్టాదార్ పాస్బుక్
- రేషన్ కార్డు
- ఆయుధ లైసెన్స్ (ఫోటోతో)
- స్వాతంత్ర్య సమరయోధుల ఐడీ
- NPR స్మార్ట్ కార్డు
- ఎంపీలు పొందే గుర్తింపు కార్డు
- పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సహాయం అందుబాటులో ఉంటుంది.
- అధికారులు ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని, తప్పనిసరిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
![]()
