నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణ

జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన లక్మి ఆనారోగ్యంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం శుక్రవారం రాత్రి చేరారు. భార్య చికిత్స పొందుతుండగా భర్త రాజు తన కుమారుడు మణికంఠతో కలిసి ఆసుపత్రిలో నిద్రించాడు. శనివారం ఉదయం లేచి చూసే సరికి కుమారుడు పక్కన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా..ముగ్గురు వ్యక్తులు మణికంఠను తీసుకెళ్లినట్లు ఉంది. పోలీసులు గాలింపు చేపట్టారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!