📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,537,373  |  160 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana ⚡ AMP

జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర జిల్లా ఇన్‌చార్జీల నియామకాలు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్

October 30, 2025 October 30, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram



జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్త జిల్లా ఇన్‌చార్జీల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకాల ద్వారా ప్రతి జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలకు బైరి రమేష్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చిప్పల నర్సింగరావు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు అశోధా భాస్కర్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు అసాది పురుషోత్తం ఇన్‌చార్జీలుగా నియమితులయ్యారు.

ఇక సిరిసిల్ల జిల్లాకు మేడి అంజయ్య, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు బ్యాగరి వెంకటస్వామి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు తుమ్మల రవికుమార్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ర్యాకం శ్రీరాములు నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం మరియు మహబూబాబాద్ జిల్లాలకు చిట్టి మల్ల సమ్మయ్య, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు అనంత రాములు, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలకు వెన్న రాజు, జనగాం జిల్లాకు బుట్టి సత్యనారాయణ, వరంగల్ జిల్లాకు జెల్ల ప్రభాకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు నీరటి రాములు, నిజామాబాద్ జిల్లాకు రొడ్డ రాంచందర్, కొమరంభీం అసిఫాబాద్ జిల్లాకు తొగరు సుధాకర్, అదిలాబాద్ జిల్లాకు బందెల బెంజిమెన్ బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ, ప్రతి ఇన్‌చార్జి తమ జిల్లా కమిటీల పనితీరు, సమన్వయం, సభ్యుల చురుకుదనం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే చేర్పులు, మార్పులు చేయవచ్చని తెలిపారు. ఇన్‌చార్జీలు రాష్ట్ర నాయకత్వానికి నిరంతరం నివేదికలు అందజేస్తూ సంఘ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు మరియు ఇన్‌చార్జీలు పరస్పర సహకారంతో పనిచేస్తూ జాతీయ మాల మహానాడు సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!