📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, August 31, 2026
Visitors: 1,699,430  |  752 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంఎవరెస్ట్ మసాలా సంస్థపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) కఠిన చర్యలు: 'ఇంగువ' విక్రయాలపై తాత్కాలిక నిషేధంప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌పై హెచ్చరిక లేబుల్స్‌: ఆహార భద్రతలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) విప్లవాత్మక నిర్ణయంఆకస్మిక వరదలతో అల్లకల్లోలమైన నేపాల్: విదేశీ రెస్క్యూ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్ ప్రభుత్వంభారత సైన్యంలోకి అమెరికా 'జావెలిన్' క్షిపణులు: రక్షణ రంగంలో చారిత్రాత్మక ఒప్పందంLatest Breaking News from PressMeetతాజా వార్తలుమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంఎవరెస్ట్ మసాలా సంస్థపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) కఠిన చర్యలు: 'ఇంగువ' విక్రయాలపై తాత్కాలిక నిషేధంప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌పై హెచ్చరిక లేబుల్స్‌: ఆహార భద్రతలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) విప్లవాత్మక నిర్ణయంఆకస్మిక వరదలతో అల్లకల్లోలమైన నేపాల్: విదేశీ రెస్క్యూ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్ ప్రభుత్వంభారత సైన్యంలోకి అమెరికా 'జావెలిన్' క్షిపణులు: రక్షణ రంగంలో చారిత్రాత్మక ఒప్పందం

మన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం

August 30, 2026 17 hr ago 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

క్షణికమైన ఆనందాన్నిచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితను దెబ్బతీసి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆదివారం నిర్వహించిన 137వ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్య రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.

మన్‌కీ బాత్‌లోని ముఖ్యాంశాలు

  • డ్రగ్స్ రహిత భారత్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా యువత శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలని కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లకు పిలుపునిచ్చారు.
  • బాధితులకు సమాజ మద్దతు: వ్యసనం నుంచి బయటపడిన వారిని సమాజం గౌరవంగా అక్కున చేర్చుకోవాలన్నారు. యోగా, ధ్యానం, ఆత్మవిశ్వాసంతో మత్తుకు దూరం కావచ్చని పేర్కొన్నారు. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్’కు లభిస్తున్న స్పందనను ప్రశంసించారు.
  • పీఎం స్వనిధి యోజన: వీధి వ్యాపారుల కోసం తీసుకొచ్చిన పీఎం స్వనిధి పథకం లబ్ధిదారుల్లో 46 శాతం మంది మహిళలే ఉన్నారని, ఇది వారి ఆర్థిక పురోగతికి ఎంతో తోడ్పడుతోందని తెలిపారు.

మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారమైన ‘ఒలియ్ దరాజాలి దస్లిక్’ లభించింది. ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ప్రధానికి లభించిన 36వ అంతర్జాతీయ పురస్కారం ఇది. ఈ గౌరవాన్ని ఇరుదేశాల మైత్రికి అంకితం చేస్తున్నట్లు తెలిపిన మోదీ, యురేనియం సరఫరా కోసం ఉజ్బెకిస్థాన్‌తో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకోనున్నట్లు ప్రకటించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *