పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుండి ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసే ప్రసంగంతో ఈ పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి.
![]()




