తెలంగాణలోని రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డి 14 బ్యాంకులతో ఎంఓయూ (MoU) కుదుర్చుకున్నారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లు, విమాన ప్రమాదాలకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా కవరేజీ ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని, పీఆర్సీ హామీని కూడా నిలబెట్టుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
![]()




