తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు (డైరెక్టర్) నవీన్ నికోలస్ గురువారం అధికారికంగా విడుదల చేశారు. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం ఇటీవల ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
![]()




