ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకూ రైతుబంధు అన్న రేవంత్రెడ్డి, ఇప్పటికే మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సత్తుపల్లిలో జరిగిన భారాస కార్యకర్తల శిక్షణలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బోనస్ను కేవలం ఏడు రకాల వడ్లకే కుదించిందని దుయ్యబట్టారు.
![]()




