ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఆయన ఈ దీక్షను ఆచరిస్తారు. మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు దీనిని పాటిస్తున్నట్లు తెలిపారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో సునీల్కుమార్, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక అష్టోత్తర పూజలు నిర్వహించారు.
![]()



