గృహిణుల సేవలను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయలేమని, వారిని ‘దేశ నిర్మాత’గా పిలవాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రోడ్డు ప్రమాద పరిహార కేసు విచారణలో భాగంగా.. గృహిణుల శ్రమకు కాదనలేని ఆర్థిక విలువ ఉందంటూ నెలవారీ సేవలను కనీసం రూ.30 వేల ఆదాయంగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది. ప్రమాదాల్లో గృహిణులు మరణించినా, గాయపడినా నష్టపరిహారాన్ని సంకుచితంగా కాకుండా, కుటుంబం కోల్పోయిన సంరక్షణ విలువను బట్టి లెక్కించాలని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
![]()


