జమ్మూకశ్మీర్లోని రాజౌరీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదుల సరికొత్త పన్నాగాలు వెలుగుచూశాయి. డ్రోన్లు, నిఘా నేత్రాలకు చిక్కకుండా ఉండేందుకు ఉగ్రమూకలు గుహలకు బదులుగా అత్యాధునిక సౌకర్యాలు, నిత్యావసరాలతో కూడిన పక్కా కాంక్రీట్ బంకర్లను నిర్మించుకుంటున్నారు. ‘ఆపరేషన్ షెరువాలీ’లో భాగంగా సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు రాజౌరీ అడవుల్లో ఒక పెద్ద బంకర్ను గుర్తించి పేల్చివేశారు. ఈ ప్రాంతంలో మరికొన్ని బంకర్లు ఉండే అవకాశముండటంతో గాలింపు ముమ్మరం చేశారు.
![]()


