అద్దెకు తీసుకున్న స్థలంలో జరిగే పర్యావరణ ఉల్లంఘనలకు కిరాయిదారే బాధ్యత వహించాల్సి ఉంటుందని, స్థల యజమానికి జరిమానా విధించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ సచ్దేవ ధర్మాసనం సమర్థించింది. సూరత్లో అద్దె స్థలంలో రసాయన పరిశ్రమ వల్ల జరిగిన కాలుష్యానికి యజమానికి రూ.25 లక్షల జరిమానా విధిస్తూ గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నోటీసును కోర్టు కొట్టివేసింది.
![]()


