వివాహం అనేది పరస్పర గౌరవం, ఉమ్మడి ఆశలు, సమాన బాధ్యతలపై ఆధారపడిన గాఢమైన భాగస్వామ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుదీర్ఘ వైవాహిక వివాదాలు దాంపత్య బంధాన్ని కాగితాలకే పరిమితం చేస్తాయని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం పేర్కొంది. 15 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్న ఓ వైద్య దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. భార్య దాంపత్య జీవితానికి అంగీకరించకుండా మానసికంగా వేధిస్తోందన్న భర్త ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
![]()



