భారత్లో ఊబకాయం, మధుమేహం వేగంగా పెరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశంలో ఊబకాయ మహిళల సంఖ్య 30.7%, పురుషులు 27.3 శాతానికి చేరారు. ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు 54.1 శాతానికి పెరిగాయి. అయితే ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 29.3 శాతానికి తగ్గడం గమనార్హం. ప్యాక్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడమే ఈ హెల్త్ ఎమర్జెన్సీకి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు.
![]()

