కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం విధాన సౌధలో జరిగిన సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ ప్రతిపాదన చేయగా, పరమేశ్వర బలపరిచారు. జూన్ 3న ఆయన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరు లోక్భవన్ గ్లాస్ హౌస్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే డీకే శివకుమార్ గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.
![]()




