మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్ను వాగ్దేవి (సరస్వతి) ఆలయంగా ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ పక్షానికి అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూజలు చేసుకునే హక్కును కల్పించడంతో శనివారం ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంగణం పూర్తిగా ఆలయానికే చెందుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
![]()




