దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పంచదార ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముడి, తెల్ల మరియు శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. అయితే, ఇప్పటికే లోడింగ్ పూర్తయిన నిల్వలకు, అలాగే ఒప్పందాల ప్రకారం ఐరోపా, అమెరికాకు జరిగే ఎగుమతులకు ఈ నిషేధం నుండి మినహాయింపునిచ్చారు.
![]()




