తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాలని ఆదేశించారు. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని అగ్ర నటుడు కమల్ హాసన్ అభినందిస్తూ, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ నిర్ణయం తమిళనాట పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.
![]()



