రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలిపారు. గవర్నర్ సూచన మేరకు హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, అదే రోజు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులతో కూడిన స్కూల్ కిట్లను అందజేయనున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ‘యాంటీ డ్రగ్ అఫిడవిట్’ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
![]()



