ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల వేదికలపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈసారి ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ధర్మశాలలో జరగనుండగా, ఎలిమినేటర్ మరియు క్వాలిఫైయర్-2 మ్యాచ్లకు ఛండీగఢ్ వేదిక కానుంది. ఇక మెగా ఫైనల్ పోరు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. వేదికల ఖరారుతో అభిమానుల్లో సందడి నెలకొంది. ధర్మశాలలోని చల్లని వాతావరణం, ఫాస్ట్ పిచ్ ఆటగాళ్లకు సవాలుగా మారనుంది.
![]()



