ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో తమిళనాడు, కేరళ సీఎంలు రాజీనామా చేయగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అందుకు నిరాకరించడం రాజ్యాంగపరమైన చర్చకు దారితీసింది. ఆర్టికల్ 164 ప్రకారం అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత కాలమే సీఎం పదవిలో ఉండగలరు. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుండటంతో, ఆ తర్వాత పాత ప్రభుత్వం కొనసాగడం అసాధ్యం. ఒకవేళ మమత రాజీనామా చేయకపోతే, గవర్నర్ జోక్యం చేసుకుని మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించడం లేదా మంత్రిమండలిని రద్దు చేసి అత్యధిక సీట్లు సాధించిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
![]()




