నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం
(ఐఎండీ) తెలిపింది. ఈనెల 14 నుండి 16 మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను
తాకవచ్చని అంచనా వేసింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే
ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో
వర్షాలు ఎక్కువగా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత
అధికంగా ఉంటుందని వెల్లడించింది. రాత్రి సమయాల్లోనూ వేడి తీవ్రత
కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
![]()




