భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మే 7తో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కీలక మీడియా సమావేశం జరగనుంది. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. వీరితో పాటు నేవీ కమాండర్ ప్రేరణా దేవస్థలి కూడా పాల్గొని, ఆపరేషన్ వెనుక ఉన్న వ్యూహాలను వివరించనున్నారు. దేశ రక్షణలో మహిళా అధికారుల పెరుగుతున్న ప్రాధాన్యతను చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
![]()




