పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముగింపు బలహీనత కాదు, ఒక వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. భారత్ ఐటీకి కేంద్రమైతే, పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువని మండిపడ్డారు. దేశ భద్రత కోసం అవసరమైతే ఎంతటి సుదీర్ఘ యుద్ధానికైనా మన సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
![]()




