యూఏఈ ఒపెక్ నుండి బయటకు రావడంతో భారత్కు చమురు కష్టాలు తీరనున్నాయి. ఉత్పత్తి పరిమితులు లేకపోవడంతో యూఏఈ తక్షణమే రోజుకు పది లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని పెంచనుంది. హార్మూజ్ జలసంధితో పనిలేకుండా ఫుజైరా పైప్లైన్ ద్వారా భారత్కు నేరుగా సరఫరా అందుతుంది. ఏప్రిల్లో యూఏఈ సరఫరా 43% పెరగడం విశేషం. దీనివల్ల దిగుమతి బిల్లు తగ్గి, దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉండటంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
![]()




