తెలంగాణ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపు కోసం రూ. వెయ్యి కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా గతేడాది అక్టోబర్ వరకు ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిధులను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలమంది విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. అధికారుల పర్యవేక్షణలో ఈ నిధుల పంపిణీ ప్రక్రియ వేగవంతం కానుంది.
![]()



