కొలంబియాలో పర్యావరణానికి ముప్పుగా మారాయనే నెపంతో 80 హిప్పోపొటమస్లను చంపాలని ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనంత్ అంబానీ స్పందించారు. ఆ మూగజీవాలను చంపవద్దని, వాటికి గుజరాత్లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తానని ప్రకటించారు. ఈ మేరకు కొలంబియా పర్యావరణ శాఖకు అధికారిక విన్నపం పంపారు. డ్రగ్ మాఫియా డాన్ ఎస్కోబార్ తెచ్చిన ఈ హిప్పోల సంతతి విపరీతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటిని అంతం చేయాలని భావించింది. వంతారా ప్రతిపాదనతో వీటికి విముక్తి లభించనుంది.
![]()




