మెదక్ జిల్లా కొల్చారం జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ధాన్యం లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]()




