వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఏయూ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సులో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. సి.వి. రామన్ వంటి దిగ్గజాలు ఇక్కడి నుంచే ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషమని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర విద్యా రంగం మరింత ఉజ్వలంగా మారుతుందని, ఏయూ మేధావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణించడం గర్వకారణమని ఆయన ప్రశంసించారు.
![]()




