భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఛైర్పర్సన్గా ఎన్నికై, కౌన్సిల్లో పూర్తిస్థాయి ఓటింగ్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. డెన్మార్క్లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె తొలిసారి పాల్గొన్నారు. క్రీడాకారుల సమస్యలు, ప్రైజ్ మనీ కేటాయింపు, టోర్నమెంట్ల ఒత్తిడి తగ్గింపు వంటి అంశాలపై ఆమె కృషి చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చురుగ్గా ఆడుతూనే ఈ కీలక పదవిని పొందడం విశేషం. ఆటగాళ్ల గళాన్ని వినిపించడం తనకు దక్కిన గౌరవమని సింధు పేర్కొన్నారు. ఆమె రాకను బీడబ్ల్యూఎఫ్ బోర్డు సాదరంగా ఆహ్వానించింది.
![]()

