హైదరాబాద్కు చెందిన మాక్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి బి.వి.వి.ఎస్.ఎన్.రాజు ఆదివారం తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల విరాళం అందజేశారు. ఇందులో రూ.76 లక్షలు అన్నప్రసాదం ట్రస్టుకు, రూ.44 లక్షలు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు వితరణ కోసం కేటాయించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరికి ఈ విరాళం డీడీలను అందజేశారు. దాతృత్వంతో స్వామివారి సేవలో భాగస్వాములైన దాతను అధికారులు అభినందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
![]()




